బెంగళూరు కేంద్రంగా 5జీ టెక్నాలజీపై మరింత పరిశోధనలు చేసేందుకు నోకియా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఒకప్పుడు విరివిగా సేవలందించిన నోకియా ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ విప్లవంతో మార్కెట్లో కనుమరుగైంది. మళ్లీ గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చేందుకు నోకియా సిద్ధమవడమేగాక ఏకంగా 5జీ టెక్నాలజీతో వస్తుండటంతో మొబైల్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Showing posts with label JIO. Show all posts
Showing posts with label JIO. Show all posts
5G మొబైల్ తో జియోకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న నోకియా Nokia is Back
బెంగళూరు కేంద్రంగా 5జీ టెక్నాలజీపై మరింత పరిశోధనలు చేసేందుకు నోకియా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఒకప్పుడు విరివిగా సేవలందించిన నోకియా ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ విప్లవంతో మార్కెట్లో కనుమరుగైంది. మళ్లీ గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చేందుకు నోకియా సిద్ధమవడమేగాక ఏకంగా 5జీ టెక్నాలజీతో వస్తుండటంతో మొబైల్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జియో ఫోన్ కొనాలనుకునేవారు ఈ విషయాలను తెలుసుకోండి
అంటే.. ప్రస్తుతం వీవోఎల్ టీఈని అందిస్తున్నది దేశంలో జియో మాత్రమే కనుక, కేవలం ఆ సంస్థకు చెందిన సిమ్ లు మాత్రమే జియో 4జీ ఫీచర్ ఫోన్ లో పనిచేస్తాయన్నమాట. ఇతర నెట్ వర్క్ లకు చెందిన సిమ్ లను వేసుకోలేం. అయితే భవిష్యత్తులో ఈ ఫోన్ కు చెందిన డ్యుయల్ సిమ్ వేరియెంట్ ను తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు జియో ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక ఈ ఫోన్ పై అనేక సందేహాలు కూడా ఉన్నాయి.
జియో 4జీ ఫీచర్ ఫోన్ నడిచేది పూర్తిగా విభిన్నమైన ఆపరేటింగ్ సిస్టమ్ తో. ఆ ఫోన్ కోసం ఓ సాఫ్ట్ వేర్ ను తయారు చేశారు. కనుక అందులో వాట్సప్ రాదు. కానీ యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ ను అందించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇక వాట్సప్ కు ప్రత్యామ్నాయంగా అందులో ఇచ్చే జియో చాట్ యాప్ ను వాడుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు ఈ ఫోన్ కు చెందిన పూర్తి స్పెసిఫికేషన్లను జియో వెల్లడించలేదు. కానీ చైనాకు చెందిన స్ప్రెడ్ ట్రమ్ కమ్యూనికేషన్ తోపాటు మరో ప్రాసెసర్ తయారీ సంస్థ అయిన క్వాల్ కామ్ కూడా జియోతో కలసి పనిచేస్తున్నట్టు గతంలో చెప్పాయి. కనుక స్ప్రెడ్ ట్రమ్ ప్రాసెసర్, క్వాల్ కామ్ ప్రాసెసర్ తో ఉండే జియో 4జీ ఫోన్ రెండు మోడల్స్ లో విడుదలయ్యేందుకు అవకాశం ఉంది.
రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ కట్టి ఫోన్ కొన్నాక కనీసం 90 రోజులకు ఒకసారి రీచార్జి చేయించుకోవాలి. అలా చేస్తేనే ఆ ఫోన్ కు గాను 3 ఏళ్ల తరువాత సెక్యూరిటీ డిపాజిట్ ను తిరిగి ఇస్తారు. లేదంటే ఇవ్వరు.
జియో 4జీ ఫోన్ కావాలనుకునే వినియోగదారులు ఫోన్ కోసం ప్రీ బుకింగ్ చేసేటప్పుడే రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఆర్డర్ కన్ ఫాం అయి డెలివరీ అవుతుంది.
జియో ఫోన్ కు అనుసంధానించుకునే కేబుల్ ను రూ.500 వరకు అదనంగా వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందట. దాంతోపాటు నెలకు రూ.309 ప్లాన్ ను కచ్చితంగా తీసుకుంటేనే ఆ కేబుల్ ను వాడుకునే వీలుంటుందని తెలిసింది.
జియో 4జీ ఫీచర్ ఫోన్ లో వైఫై హాట్ స్పాట్ లేదు. దీంతో ఈ ఫోన్ లో ఉన్న ఇంటర్నెట్ ను ఇతర డివైస్ లకు షేరింగ్ ద్వారా పొందలేము.
జియో 4జీ ఫీచర్ ఫోన్ ను కొని అందులో వాడే సిమ్ ను రీచార్జి చేసుకున్నాక రోజుకు 500 ఎంబీ డేటా లభిస్తుందని చెప్పారు. అదండీ జియో ఫోన్ సంగతి...
డిజిటల్ ఇండియాకు ముందుంది మోడినా ? ముఖేశా ?
దీనిపై ఇప్పటికే రిలయన్స్ జియో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ)కి ఓ ప్రపోజల్ను పంపినట్టు తెలిసింది. ఇది ఓకే అయితే మొదటి దశలో దేశంలో ఉన్న 38వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. తరువాత మిగిలిన కళాశాలల్లోనూ ఇలాంటి సేవలు అందించనున్నాట్లు తెలుస్తోంది.
అయితే.. ఉచిత వైఫైని జియో అందించాలని రిలయన్స్ అనుకున్నా కూడా అది ఏకపక్షంగా సాధ్యం కాదని.. నేరుగా ఆ కంపెనీకే ప్రాజెక్టు ఇవ్వడం కుదరదని ఈ విషయంలో టెండర్లను ఆహ్వానిస్తామని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. అయితే ఉచితంగా వైఫై సేవలను అందించడానికి జియో ముందుకొస్తుండడంతో ఆ కంపెనీకే టెండరు దక్కడం ఖాయం.


