అంటే.. ప్రస్తుతం వీవోఎల్ టీఈని అందిస్తున్నది దేశంలో జియో మాత్రమే కనుక, కేవలం ఆ సంస్థకు చెందిన సిమ్ లు మాత్రమే జియో 4జీ ఫీచర్ ఫోన్ లో పనిచేస్తాయన్నమాట. ఇతర నెట్ వర్క్ లకు చెందిన సిమ్ లను వేసుకోలేం. అయితే భవిష్యత్తులో ఈ ఫోన్ కు చెందిన డ్యుయల్ సిమ్ వేరియెంట్ ను తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు జియో ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక ఈ ఫోన్ పై అనేక సందేహాలు కూడా ఉన్నాయి.
జియో 4జీ ఫీచర్ ఫోన్ నడిచేది పూర్తిగా విభిన్నమైన ఆపరేటింగ్ సిస్టమ్ తో. ఆ ఫోన్ కోసం ఓ సాఫ్ట్ వేర్ ను తయారు చేశారు. కనుక అందులో వాట్సప్ రాదు. కానీ యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ ను అందించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇక వాట్సప్ కు ప్రత్యామ్నాయంగా అందులో ఇచ్చే జియో చాట్ యాప్ ను వాడుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు ఈ ఫోన్ కు చెందిన పూర్తి స్పెసిఫికేషన్లను జియో వెల్లడించలేదు. కానీ చైనాకు చెందిన స్ప్రెడ్ ట్రమ్ కమ్యూనికేషన్ తోపాటు మరో ప్రాసెసర్ తయారీ సంస్థ అయిన క్వాల్ కామ్ కూడా జియోతో కలసి పనిచేస్తున్నట్టు గతంలో చెప్పాయి. కనుక స్ప్రెడ్ ట్రమ్ ప్రాసెసర్, క్వాల్ కామ్ ప్రాసెసర్ తో ఉండే జియో 4జీ ఫోన్ రెండు మోడల్స్ లో విడుదలయ్యేందుకు అవకాశం ఉంది.
రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ కట్టి ఫోన్ కొన్నాక కనీసం 90 రోజులకు ఒకసారి రీచార్జి చేయించుకోవాలి. అలా చేస్తేనే ఆ ఫోన్ కు గాను 3 ఏళ్ల తరువాత సెక్యూరిటీ డిపాజిట్ ను తిరిగి ఇస్తారు. లేదంటే ఇవ్వరు.
జియో 4జీ ఫోన్ కావాలనుకునే వినియోగదారులు ఫోన్ కోసం ప్రీ బుకింగ్ చేసేటప్పుడే రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఆర్డర్ కన్ ఫాం అయి డెలివరీ అవుతుంది.
జియో ఫోన్ కు అనుసంధానించుకునే కేబుల్ ను రూ.500 వరకు అదనంగా వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందట. దాంతోపాటు నెలకు రూ.309 ప్లాన్ ను కచ్చితంగా తీసుకుంటేనే ఆ కేబుల్ ను వాడుకునే వీలుంటుందని తెలిసింది.
జియో 4జీ ఫీచర్ ఫోన్ లో వైఫై హాట్ స్పాట్ లేదు. దీంతో ఈ ఫోన్ లో ఉన్న ఇంటర్నెట్ ను ఇతర డివైస్ లకు షేరింగ్ ద్వారా పొందలేము.
జియో 4జీ ఫీచర్ ఫోన్ ను కొని అందులో వాడే సిమ్ ను రీచార్జి చేసుకున్నాక రోజుకు 500 ఎంబీ డేటా లభిస్తుందని చెప్పారు. అదండీ జియో ఫోన్ సంగతి...
