దీనిపై ఇప్పటికే రిలయన్స్ జియో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ)కి ఓ ప్రపోజల్ను పంపినట్టు తెలిసింది. ఇది ఓకే అయితే మొదటి దశలో దేశంలో ఉన్న 38వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. తరువాత మిగిలిన కళాశాలల్లోనూ ఇలాంటి సేవలు అందించనున్నాట్లు తెలుస్తోంది.
అయితే.. ఉచిత వైఫైని జియో అందించాలని రిలయన్స్ అనుకున్నా కూడా అది ఏకపక్షంగా సాధ్యం కాదని.. నేరుగా ఆ కంపెనీకే ప్రాజెక్టు ఇవ్వడం కుదరదని ఈ విషయంలో టెండర్లను ఆహ్వానిస్తామని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. అయితే ఉచితంగా వైఫై సేవలను అందించడానికి జియో ముందుకొస్తుండడంతో ఆ కంపెనీకే టెండరు దక్కడం ఖాయం.
