India Wins First T20 Match Ind v/s Aus t20 Series

కంగారులను కంగారు పెట్టించారు ...
ఆకట్టుకున్న యువ పేసర్‌ బుమ్రా రాణించిన విరాట్‌ కోహ్లి , రైనా 151 పరుగులకే ఆసీస్‌ చిత్తు అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 37 పరుగుల తేడాతో కంగారూలను చిత్తుగా ఓడించింది. ఆతిథ్య గడ్డపై పర్యటన ఆరంభంలోనే వన్డే సిరీస్‌ను 1-4తో చేజార్చుకుని భంగపడిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌, బౌలింగ్‌తో కంగారెత్తించేసింది.
తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. విరాట్‌ కోహ్లి (90 నాటౌట్‌: 55 బంతుల్లో 9×4, 2×6) చెలరేగి ఆడటంతో 3 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనను ఆస్ట్రేలియా ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌ (44: 33 బంతుల్లో 4×4, 2×6), వార్నర్‌ (17: 9 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా ఆరంభించి తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలోనే 47 పరుగులు జత చేశారు. ఈ జోడిని అద్భుతమైన బంతితో టీమిండియా యువ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (23/3) ఓపెనర్‌ వార్నర్‌ని ఔట్‌ చేయడం ద్వారా విడదీశాడు. స్పిన్నర్లు జడేజా (22/2), అశ్విన్‌ (28/2) కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ.. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లను క్రీజులో స్వేచ్ఛగా కదలనీయకుండా చేశారు. దీంతో ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. టీమిండియాలోకి పునరాగమనం చేసిన ఆశిష్‌ నెహ్రా (30/1) నిరాశపరచగా.. హార్డిక్‌ పాండ్య (37/2) ఫర్వాలేదనిపించాడు. ఈ విజయంతో భారత్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 29న జరగనుంది. ఆసీస్‌పై చెలరేగిన విరాట్‌ కోహ్లి టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత్‌ ఓపెనర్లలో శిఖర్‌ ధావన్‌ (5) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరి నిరాశపరిచినా.. రోహిత్‌ శర్మ (31: 20 బంతుల్లో 4×4, 1×6) మాత్రం తనదైన శైలిలో తొలి ఓవర్‌ నుంచే ఆసీస్‌ పేసర్లపై విరుచుకుపడి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అయితే వాట్సన్‌ ఒకే ఓవర్‌లో రోహిత్‌, ధావన్‌లను వరుసగా ఔట్‌ చేయడంతో భారత్‌ 4.5 ఓవర్లలో 41/2తో నిలిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లి (90 నాటౌట్‌: 55 బంతుల్లో 9×4, 2×6) మరోసారి కంగారూలకు భారీ షాట్లతో చుక్కలు చూపించాడు. రోహిత్‌ ఔట్‌ అనంతరం క్రీజులో వచ్చిన కోహ్లి దూకుడుగా ఆడుతూ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా (41: 34 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్‌లో రైనా ఔటైనా... కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (11 నాటౌట్‌: 3 బంతుల్లో 1×4, 1×6) బ్యాట్‌ ఝళిపించడంతో భారత్‌ 188 పరుగులు చేయగలిగింది.


ThanQ Visit Again.

Related Posts