రిలయన్స్ జియో 4జి ఫీచర్ ఫోన్ కంటే ముందే మార్కెట్లో 4జి ఫీచర్ ఫోన్లు విడుదలవుతున్నాయి. దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ మంగళవారం తన నవరత్న సీరీస్లో కొత్త 4జి వోల్టే ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లతో పాటు కంపెనీ ఇదే సీరీస్లో మరో ఎనిమిది 2జి ఫీచర్ ఫోన్లనూ విడుదల చేసింది. వీటి ధర ఫీచర్లను బట్టి రూ.700 నుంచి రూ.1,500 వరకు ఉంది. టర్బో + 4జి పేరుతో విడుదల చేసిన 4జి వోల్ట్ ఫీచర్స్ ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్ప్లే : 2.4 అంగుళాల క్యువిజిఎ
ఆపరేటింగ్ సిస్టమ్ : కాయ్ ఔస్
ర్యామ్ : 512 ఎంబి
ఇంటర్నల్ స్టోరేజ్ : 4 జిబి (32 జిబి వరకు పెంచుకోవచ్చు)
కెమెరా : వెనక 2 ఎంపి, ముందు విజిఎ షూటర్
బ్యాటరీ : 2000 ఎంఎహెచ్
