పోలీస్ ఎన్ కౌంటర్ లో నయీం హతం - ఆపరేషన్ కెసిఆర్




తెలంగాణ సిఎం కేసీఆర్ తాను నమ్మిన సిద్దాంతం కోసం ఎంతకైనా తెగించే రకం. ఆయన ఎంతటి మొండి మనిషే అందరికి తెలుసు. ఆయన తనను నమ్ముకున్న వాళ్లను కూడా ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తి. తాజాగా గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ కూడా తన వాళ్లను రక్షించుకునేందుకే చేయించారు అనే ఓ వాదన బలంగా వినిపిస్తోంది. నయీం ఏకంగా కేసీఆర్ తో ఎంతో సఖ్యతతో మెలిగే ఓ వ్యాపార వేత్తను బెదిరించారని.. ఆయన నేరుగా వచ్చి కేసీఆర్ తో చెప్పుకున్నారని.. దాంతో కేసీఆర్ వెంటనే దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
తన టీంలో మెంబర్ అయిన భువనగిరి ఎమ్మెల్యేను, మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా నయీంను బెదిరించారని.. ఏకంగా తన అనుమతి లేకుండా నియోజక వర్గంలోకి అడుగుపెట్టవదు అని వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. దీంతో తమ రాజీనామా పత్రాలతో కేసీఆర్ ను కలిశారని.. అందుకు కేసీఆర్ వారికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఇచ్చారని తెలిసింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ కార్లతో ఎన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తామని కేసీఆర్ తో అన్నారట. దాంతో పోలీసులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

ThanQ Visit Again.

Related Posts