Showing posts with label Apple. Show all posts
Showing posts with label Apple. Show all posts

Top 5 Highest Paid CEOs


పదేళ్ల నుంచి జీతాల గురించిమాట్లాడుకోవటం ఎక్కువైంది. ఎప్పుడైతే ఐటీ బూమ్ పెరిగిందో.. అప్పటి నుంచి భారీ జీతాల గురించి గొప్పలు చెప్పుకోవటం మొదలైంది. ఐఐటీ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన విద్యార్థికి లక్షల్లో జీతాలంటూ వార్తలు రావటం లాంటివి చూసినప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న కొన్ని కంపెనీల్ని నిర్వహించే నిర్వాహకుల జీతాల ఏస్థాయిలోఉంటాయా? అన్న సందేహం కలగక మానదు. ప్రపంచ ఐటీ రంగానికి దశ..దిశను నిర్దేశించే మైక్రోసాప్ట్ కావొచ్చు.. సోషల్ నెట్ వర్క్ లో కింగ్ లాంటి ఫేస్ బుక్.. సెర్చింజన్ లో ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన గూగుల్ సీఈవోలకు జీతాలు ఎంతేసి ఉంటాయి? అన్న డౌట్ వచ్చిందా? అలాంటి డౌట్ కు తీర్చుకునేందుకు వెతకటం మొదలు పెడితే ఆసక్తికర సమాచారం లభించింది. సోషల్ మీడియాలో సుపరిచితమైన ఫేస్ బుక్.. ట్విట్టర్ విషయాలకు వస్తే.. ట్విట్టర్ సీఈవో  జాక్ డార్సీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోడట.కాకుంటే తన వ్యక్తిగత.. ఇంటి భద్రత కోసం మాత్రం నెలకు రూ.46 లక్షలు తీసుకుంటాడట. ఇక ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ జీతం కూడా అంతే. అతగాడి వార్షిక జీతం కేవలం రూ.68 మాత్రమే. అంతపెద్ద పొజిషన్లో ఉండి కూడా అస్సలు జీతం అన్నది తీసుకోకుండా ఉండటం కాస్త చిత్రమే కదూ.

ఇక.. భారీగా జీతాలు తీసుకునే ప్రముఖల్ని చూస్తే.. (ఏడాదికి)
=  మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు.. సలహాదారు  బిల్ గేట్స్ వార్షిక జీతం రూ.78వేల296కోట్ల 83లక్షల33వేల333
= గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీతం రూ.669కోట్ల 84 లక్షల 20 వేల 475
=  మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం రూ.573కోట్ల 94లక్షల 25వేలు
= యాహు సీఈవో మరిస్సా మేయిర్ రూ.289కోట్ల 95లక్షలు
= యాపిల్ సీఈవో టీమ్ కుక్ జీతం రూ.62కోట్ల 77లక్షల 28 వేల 333

సిమ్లా యాపిల్ ని మరిపించే ఏపీ యాపిల్

యాపిల్ పండ్లు అంటే అయితే సిమ్లా.. లేదంటే జమ్మూకశ్మీర్ లాంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారని అనుకుంటారు.అయితే.. హైదరాబాద్ లోని సీసీఎంబీ (సెల్యులర్.. మాలిక్యులర్ బయలజీ సెంటర్) శాస్త్రవేత్తలు ఆంధ్రా.. ఒడిశాలలోని కొన్ని ప్రాంతాల్లో యాపిల్ సాగు చేయాలని రెండేళ్ల కిందట నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పరిశోధనలు చేపట్టి.. 2014లలో లంబసింగి.. చింతపల్లి ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా యాపిల్ సాగు చేస్తున్నారు.

అనుకున్న దాని కంటే మిన్నగా యాపిల్ పంట సాగుతుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 40 మొక్కల్ని నాటారు. వాటి ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నారు. వీటిల్లో ఐదు మొక్కల్ని పండ్ల కోసం కేటాయించారు. ఈ ఐదు మొక్కలకు సంబంధించి ఆరు యాపిల్ కాయలు పండాయి. దీంతో.. వీటి రుచిని పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి శాస్త్రవేత్తలు చింతపల్లికి వెళ్లారు. వాటి రుచిని స్వయంగా చూశారు.

ఈ యాపిళ్ల రుచి.. సిమ్లా యాపిల్ కంటే బాగుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రుచిలోనే కాదు.. రంగు.. సైజ్ లోనూ ఏపీ యాపిల్ అదిరిపోయిందని.. నిజానికి రెండేళ్ల వ్యవధిలోనే కాపు కాయటం విచిత్రమైన అంశమని సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే యాపిల్.. చింతపల్లి (ఏజెన్సీ ప్రాంతం) వాతావరణం బాగా సూట్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాము అనుకున్న దాని కంటే బాగా విజయవంతం కావటంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు ఏపీ యాపిల్ మీద మరింత ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. రానున్న రోజుల్లో మార్కెట్లోకి వచ్చే ఏపీ యాపిల్ అదరగొట్టటం ఖాయమన్న మాట.