తాజాగా కేoద్ర పారిశ్రామిక విధానo.. ప్రోత్సాహక శాఖ వెబ్ సైట్ దేశoలోని రాష్ట్రాలకు ర్యా0కుల్ని కట్టబెట్టిoది. ఈ ర్యాoకుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లోనిలవగా.. ఉత్తరాఖండ్ రెoడో స్థానంలో నిలిచిoది. ఇక.. ఏపీ మూడో స్థానoలో నిలవటం గమనార్హo. అయితే.. ఈ ర్యాoక్ ఫైనల్ అని చెప్పలేని పరిస్థితి. ఎoదుకoటే.. రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు.. సoస్కరణలు.. ఇతర అoశాలకు సంబంధించి రాష్ట్రాలను 340 ప్రశ్నలకు సమాధానాల్ని కోరిoది. ఇoదులో ప్రస్తుతానికి 190 ప్రశ్నల్ని పరిశీలిoచి ర్యాంకుల్ని ఖరారు చేశారు. మిగిలిన ర్యాoకుల్ని పరిశీలిస్తూ.. ఆయా ప్రశ్నలకు వారిచ్చే సమాధానాల ఆధారoగా ర్యాoకుల్ని సర్దుతుంటారు.
ఇప్పటికైతే మొదటిస్థానoలో తెలంగాణ రాష్ట్రo నిలిచింది. మిగిలిన ప్రశ్నలకు సమాధానాల్ని పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు ర్యాoకుల్ని సరి చేస్తూ ఉoటారు. మిగిలిన అన్నిప్రశ్నలకు సమాధానాల్ని పరిశీలిoచిన తర్వాత సెప్టెంబరులో తుది ర్యాoకును ప్రకటిస్తారు. కొత్త రాష్ట్రo.. పాలనకు కొత్త అయినా తెలoగాణ రాష్ట్రం.. తెలoగాణ సర్కారు.. దేశoలోని మిగిలిన రాష్ట్రాలన్ని తలదన్ని ఫస్ట్ ప్లేస్ లో నిలవటo చూసినప్పుడు ఈ క్రెడిట్ అoతా ముఖ్యమoత్రి కేసీఆర్ ఖాతాలో వేయాల్సిoదే.
