'బాహుబలి 2' షూటింగ్‌కు కేరళ గిరిజనులు అడ్డంకి !!




బాహుబలి-2 చిత్రాన్ని రామోజీ ఫిలింసిటీలో కొంత తీశాక.. బల్గేరియాలోనూ, కేరళలోనూ కొంత పార్ట్‌ తీయాలని ప్లాన్‌ చేశారు. ఇందుకోసం రంగం సిద్ధమైంది. అయితే.. కేరళలోని గిరిజన ప్రాంతంలోని ఓ అడవిలో షూటింగ్‌ చేయడానికి సన్నాహాలు చేశారు. ఇందుకోసం ఆ ప్రభుత్వం నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

బాహుబలి మొదటిభాగం అక్కడ కూడా బాగానే ఆడింది. అయితే అక్కడి గిరిజనులు ఈ చిత్ర షూటింగ్‌ అడ్డుకుంటామని ప్రకటించడంతో.. యూనిట్‌ ఆలోచనలో పడింది. దానికి ప్రధాన కారణం.. అక్కడ గతంలో చేసిన చిత్రీకరణలో కొంతమంది గిరిజనులు పాల్గొన్న వారెవరూ ఆ చిత్రంలో లేరట. దాంతో వారికి సరైన వివరణ ఇచ్చుకోలేని యూనిట్‌, మరో ప్రాంతానికి వెళ్ళే ఆలోచనలో వున్నట్లు తెలియవచ్చింది. ఇందుకోసం చిత్ర యూనిట్‌ కొత్త ప్రాంతాన్ని వెతికే పనిలో వున్నారు. కాగా, ఈ నెల 26 నుంచి అక్కడ ప్లాన్‌ చేయాల్సి వుంది.
ThanQ Visit Again.

Related Posts