ఢిల్లీ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్యోగుల విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మరో కమిటీ వేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించింది. మొత్తం ఐదుమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఎపి, తెలంగాణ రెసిడెండ్ కమిషనర్లు, ఆర్థికశాఖ కార్యదర్శలు కమిటీ సభ్యులుగా ఉన్నారు. రెండు నెలల్లో విభజన సమస్యలను పరిష్కారం చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈనెల 26న తొలి సమావేశం జరుగనుంది. షెడ్యూల్ 9, 10లోని అంశాలు, ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించనున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్చించనున్నారు.
Showing posts with label TG. Show all posts
Showing posts with label TG. Show all posts