ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం నిశాగాంధీ పురస్కారం అందజేసింది



ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం నిశాగాంధీ పురస్కారం అందజేసింది. కేరళ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో బుధవారం నిశాగాంధీ డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ. 1,50,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్‌ అకాడమీ ఏర్పాటు కోసం ఇళయరాజాకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ఉమెన్‌చాందీ ప్రకటించారు. అకాడమీ ఏర్పాటుచేసి వందలాది మంది ఇళయరాజాలను తయారుచేస్తానని ఈ సందర్భంగా ఇళయరాజా పేర్కొన్నారు.
ThanQ Visit Again.

Related Posts