కొత్తగా యాబై రూపాయల నోటు New 50 Rupees Note



నోట్ల రద్దు తర్వాత మరిన్ని సెక్యూరిటీ ఫ్యూచర్స్, మరింత భద్రతతో కొత్త 100, 50 నోట్లు కూడా రాబోతున్నట్లు చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). ఇన్నాళ్లు వాటిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అధికారులు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. RBI విడుదల చేయనున్న కొత్త రూ.50 నోటు ఇదే అంటూ వాట్సాప్ లో ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.

కొత్త 50 రూపాయల నోటు నీలం రంగులో ఉంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంది. ముద్రణ సంవత్సరం 2016గా ఉందని దరిపోర్టర్ టైమ్స్ డాట్ కాం అనే వెబ్ సైట్ కథనం ప్రచురించింది. ఏడాది క్రితమే ఈ నోట్ల ముద్రణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. విడుదల చేయటంలో ఆలస్యం అయ్యిందని వివరించింది. మొదటి సారి నీలం రంగులో భారతీయ నోటు రావటం కూడా ఇదే అని స్పష్టం చేసింది.

నీలం రంగులో ఉన్న కొత్త రూ.50 నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ ఉంది. వెనక భాగంలో పార్లమెంట్ చిహ్నం ఉందని చెప్పింది. కట్టల రూపంలో ఈ నోట్లు ఇంకా మార్కెట్ లోకి రాలేదు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇది అసలా.. నకిలీనా అనే డౌట్ సామాన్యుల్లో ఉంది. పెద్ద ఎత్తున ఈ వార్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

ThanQ Visit Again.

Related Posts