ఫాస్ట్ ట్యాగ్ లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడంతో పాటు టోల్గేట్ల దగ్గర కామన్ సర్వీసెస్ సెంటర్ (సీఎస్సీ) ద్వారా వాటిని అమ్మేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. శుక్రవారం (ఆగస్టు18) నుంచి ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. బ్యాంకులు, NHAI, IHMCL వెబ్సైట్ల ద్వారా ఈ ఫాస్టాగ్లను వాహనదారులు కొనుగోలు చేయవచ్చు.
మైఫాస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, ఫాస్టాగ్ను కొనుగోలు చేయవచ్చని..లేదంటే రీచార్జి చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఫాస్టాగ్ పార్ట్నర్ యాప్ ద్వారా వాహనాలడీలర్లు, బ్యాంకులు,CSC వంటి సంస్థలు ఫాస్టాగ్లను అమ్మవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 6 లక్షల ఫాస్ట్ ట్యాగ్ ల అమ్మకాలు జరిగాయని… తాజా చర్యలతో ఈ విక్రయాలు మరింత పెరిగే అవకాశముందని తెలిపింది ఎన్హెచ్ఏఐ. ఫాస్ట్ ట్యాగ్ ఎలక్రాటినిక్ టోల్ వసూలు కోసం వినియోగించే పరికరం. వాహనదారుడికి సంబంధించిన అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత ఈ పరికరాన్ని వాహనం ముందు అద్దానికి అతికిస్తారు. వాహనం టోల్గేట్ దగ్గరకుచేరుకోగానే, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ప్రీపెయిడ్ అకౌంట్ నుంచి టోల్ టాక్స్ సంబంధిత సంస్థకు జమ అవుతుంది. దీంతో..వాహనదారుడు టోల్గేట్ దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లిపోవచ్చు.
