తాజాగా ఏపీ మంత్రి వర్గ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. భారత్ కు రజత పతకం తీసుకురావటం ద్వారా తెలుగోళ్ల సత్తాను ప్రపంచానికి చాటిన సింధుకు భారీ ప్రోత్సాహాకాల్ని ప్రకటించారు. సింధుకి రూ.3కోట్ల నగదు ప్రోత్సాహకంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం.. ఏపీ రాజధాని అమరావతిలో 1000 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఆమెకు కోచ్ గా వ్యవహరించిన గోపీచంద్ కురూ.50 లక్షల నగదు బహుమతిని అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. సిందుకు ఢిల్లీ ప్రభుత్వం రూ.2కోట్లు.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. మరెవరికీ అందనంత భారీగా ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు సింధుకు నజరానాను ప్రకటించటం విశేషం.
